High Court : అక్రమ నిర్మాణాలపై అధికారుల తీరు పట్ల తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

TRINETHRAM NEWS

అక్రమ నిర్మాణాల పట్ల చర్యలు తీసుకోని అధికారుల ఫోటోలను ట్యాంక్ బండ్‌పై ప్రదర్శించాలి

Trinethram News : రాజేంద్రనగర్‌లోని తమ ప్రైవేటు భూమిలో కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, అధికారులు పట్టించుకోవడం లేదని హైకోర్టును ఆశ్రయించిన సయ్యద్ రహీమున్నీసా మరో ఏడుగురు వ్యక్తులు

ఈ పిటిషన్‌పై విచారణ చేస్తూ, అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోని అధికారుల ఫోటోలను ట్యాంక్ బండ్‌పై ప్రదర్శించాలని వ్యాఖ్యానించిన జస్టిస్ విజయసాయిరెడ్డి

అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఉత్తర్వులు జారీ చేశామని స్టాండింగ్ కౌన్సిల్ చెబుతుంది. టాస్క్ ఫోర్స్ అధికారులకు ఉత్తర్వులను పంపించామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. పోలీసుల నుండి భద్రత లేదని టాస్క్ ఫోర్స్ అధికారులు చెబుతున్నారు. అది శాంతిభద్రతల సమస్య అని పోలీసులు చెబుతున్నారు. ఇలా అందరూ చేతులు దులుపుకుంటే ఎలా అంటూ అధికారులపై అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు ధర్మాసనం

వచ్చే వాయిదా లోగా పిటిషనర్ ఇచ్చిన వినతి పత్రంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని అధికారులను ఆదేశించిన హైకోర్టు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Telangana High Court's key

You cannot copy content of this page

Scroll to Top