స్వామి వారి నిజరూప దర్శనం చేసుకునే అవకాశం
Trinethram News : సింహాచలం :ఏపీలోని విశాఖపట్టణంలోని సింహాచలం దేవస్థానంలో ఈనెల 30న చందనోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సింహాచలంలో చందనోత్సవం నిర్వహణ, ఆలయ అభివృద్ధి, పంచ గ్రామాల సమస్య పరిష్కారంపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. స్వామి వారిని దర్శనం చేసుకున్న ప్రతి ఒక్క భక్తుడికి ఉచిత లడ్డూ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


