తేదీ : 10/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గణపవరం గ్రామ సచివాలయం – 3 వద్ద ఉచిత కుట్టు మిషన్లు శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే పి. ధర్మరాజు స్థానిక నేతలతో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులు సంక్షేమంపై ఫోకస్ పెట్టిందని, దీనిలో భాగంగా మహిళలకు జీవన ఉపాధి కల్పించే ఉద్దేశంతోనే టైలరింగ్ శిక్షణ అని తెలిపారు. అనంతరం వారి నైపుణ్యం ఆధారంగా వారికి కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


