290 మంది లబ్ధిదారులకు.. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 7 : శుక్రవారం కెపిహెచ్బి డివిజన్ ఎమ్మార్వో కార్యాలయం నందు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటు కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు 290 మంది లబ్ధిదారులకు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిరుపేద ఆడబిడ్డ పెళ్లయితే వారికి అండగా ఉండాలన్న సదుద్దేశంతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పండాల సతీష్ గౌడ్, ఆవుల రవీందర్ రెడ్డి, ముద్దం నరసింహ యాదవ్, జూపల్లి సత్యనారాయణ, సబియా గౌసుద్దీన్, పగుడాల శిరీష బాబురావు నాయకులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App