WhatsApp Image 2025 02 05 at 09.36.13
తప్పుడు ఆఫిడవిడితో పోలీస్ వెరిఫికేషన్
దర్యాప్తులో తేలిన కేసు,,,,వ్యక్తి పై చట్టరీత్య చర్య -1 టౌన్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని నరసింగోజు రాజేష్ కుమార్ s/o శ్రీహరి కాకతీయ నగర్, గోదావరిఖని కి చెందిన ఈ వ్యక్తి తనపై ఎలాంటి కేసులు లేవని తప్పుడు అఫిడవిట్ చూపించి, పోలీస్ వెరిఫికేషన్ కొరకై దరఖాస్తు చేసుకోగా పోలీస్ స్పెషల్ బ్రాంచ్ ఉన్నతాధికారులు తనపై దర్యాప్తు చేసి ఒక్క క్రిమినల్ కేసు ఉందని వివరాలు వెల్లడించి, అట్టి వ్యక్తిపై కేసు నమోదు చేయవలసిందిగా గోదావరిఖని వన్ టౌన్ పోలీసు వారిని సూచించగా, అట్టి వ్యక్తిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయడం జరిగింది.
ప్రజలకు తెలియజేయునది ఏమనగా తప్పుడు ధ్రువపత్రాలు చూపి సర్టిఫికెట్లు పొందాలి అనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
