జూన్ 26, 2026

WhatsApp Image 2025 02 04 at 20.49.58

TRINETHRAM NEWS

కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల 4 కోడ్లో ను రద్దు చేయాలి- ఏఐటీయూసీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కు రాజు గౌడ్ డిమాండ్

హనుమకొండ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
04 ఫిబ్రవరి 2025

దేశ కార్మికులు దశాబ్దాల పాటు పోరాడి తెచ్చుకున్న చట్టాలు ఈనాటికి కేంద్ర బిజెపి ప్రభుత్వం 4 కోడలుగా తీసుకువచ్చి వాటిని అమలుపరిచే విధంగా ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయడానికి ఈరోజు బిల్లు ప్రవేశపెట్టింది దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తూ తెలంగాణ మొత్తం కార్మికులు రేపు అనగా ఫిబ్రవరి 5వ తారీఖు నాడు జిల్లా కేంద్రాల్లో హనుమకొండ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు.. ఇందులో భాగంగా కార్మికులు సమ్మె చేసే హక్కు కోల్పోవడం కార్మికులు జీతాలు పెంచమని హక్కును కోల్పోతాయి పారిశ్రామికులకు బడా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఈ కేంద్రం ఈ చట్టాలు తెచ్చింది కార్మికులు మరియు ఉద్యోగులకు 8 గంటల నుండి మళ్లీ 12 గంటలు పని చేసే విధంగా కార్మికులు ఏజమాన్యం ఒత్తిడి ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు కార్మికులను తమ విధులను చల్లి తీసేసే యజమాన్యంకి అవకాశం ఉంటుంది సంఘాలు కూడా నిర్మాణానికి రాకుండా ఇవి కేంద్రం కేవలం పని చేసే విధంగానే రోజు వారి కూలీలాగా ప్రభుత్వం చట్టాలను తీసుకొచ్చింది.

రైతులకు తమ యొక్క భూములలో ఉన్నటువంటి హక్కును కూడా కోల్పోయి జాతీయ రహదారులైతే మీరు ట్రాక్లైతేనేమి జిల్లా మండల కేంద్రాలలో రహదారులైతేనేమి వారు ఇష్టం వచ్చినట్టుగా భూమిని తీసుకోవడం జరుగుతుంది రైతుకు ఎలాంటి భూమిని విలువను బట్టి పరిహారం చెల్లించకుండానే కేంద్ర ప్రభుత్వం రైతుల నుండి భూములు లాక్కునే విధంగా యొక్క చట్టాలను తీసుకొచ్చింది కాబట్టి, చట్టాలను నిరసిస్తూ కేంద్రం ఈ నాలుగు కోడ్లను రద్దుచేసి రైతు వ్యతిరేక కార్మిక చట్టాలను పూర్తిగా వెనక్కు తీసుకునే వరకు కార్మికులు ,కర్షకులు రైతులు కార్మిక సంఘాలుగా ఏర్పడి రేపు ఢిల్లీని తలెత్తిన విధంగా ఈ యొక్క పోరాటాలు జరుగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నాం..

కావున ఫిబ్రవరి 5 అనగా రేపు జరిగే హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉదయం 10 గంటలకు నిరసన కార్యక్రమం ఉంటది కావున కార్మికులు సంఘటిత, అసంఘటిత కార్మికులు, రైతులు, ఉపాధి హామీ కార్మికులు , ఆటో కార్మికులు బీడీ కార్మికులు , ఉద్యోగులు ,భవన నిర్మాణ కార్మికులు, మున్సిపాలిటీ కార్మికులు, గ్రామపంచాయతీ కార్మికులు, ప్రతి ఒక్క రంగం నుండి దాదాపుగా ఒక 100 మందికి తగ్గకుండా హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం నిరసన కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను.. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షులు వేల్పుల సారంగపాణి , సహాయ కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా, బత్తిని సదానందం, ఆదరి రమేష్, గుంటి రాజేందర్ ,ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

AITUC

You cannot copy content of this page