జూన్ 26, 2026

WhatsApp Image 2024 12 11 at 19.35.01

TRINETHRAM NEWS

ఏకసభ్య కమిషన్కు వినతి పత్రాలు అందజేసిన ఢిల్లీ మండలం మాల మహానాడు నాయకులు పెరుమాల అనిల్ కుమార్
దిండి గుండ్లపల్లి త్రినేత్రం న్యూస్
తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ పైన రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఏకసభ్య కమిషన్ బుధవారం అత్తర్నల్గొండ జిల్లా కలెక్టరేట్ భవనంలో ఏర్పాటు చేసిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఏకసభ్య కమిషనర్ జస్టిస్ డాక్టర్ షమీం అత్తర్ కి స్వయంగా కలిసి డిండి మండల మాల మహానాడు నాయకులు అనిల్ కుమార్ తమ అభిప్రాయ వినతి పత్రం అందజేశారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో గోనబోయినపల్లి ప్రతాప్ నగర్ బొగ్గుల దాన మరియు మండలంలోని అన్ని గ్రామాల మాల మహానాడు కమిటీ నాయకులు పెద్ద ఎత్తున బయలుదేరి ఏకసభ్య కమిషన్కు వినతి పత్రాలను అందజేశారు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం రాజ్యాంగ విరుద్ధం కావున తీర్పును వ్యతిరేకిస్తున్నాం రాజ్యాంగంలోని షెడ్యూల్ కులాలకు కల్పించిన15 15% రిజర్వేషన్ పూర్తిగా అంటరానితనం వివక్ష తను దేశవ్యాప్తంగా ఉన్న 1267 కులాలను ఒకే జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించారు బాబాసాహెబ్ అంబేద్కర్ స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడిచిన కల్పించిన 15 శాతం రిజర్వేషన్లు పూర్తిగా అమలు చేసిన అది చెల్లదని సుప్రీంకోర్టు 2004లో తీర్పు ఇవ్వడం జరిగింది 341 ఆర్టికల్ ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో శాసనసభల్లో పార్లమెంట్లో 2/3 వంతు మెజార్టీతో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేయాలని గతంలో ఐదుగురితో కూడిన ధర్మాసనం చెప్పడం జరిగింది భారతదేశంలోని పౌరులందరూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండే దిశలో న్యాయవ్యవస్థ పనిచేయాలి ప్రైవేట్ రంగంలో ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయాలి బిజెపి ప్రభుత్వం ఎస్సీల మధ్యలో చిచ్చుపెట్టే విధంగా ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు ద్వారా దొడ్డిదారిలో ఇచ్చిన తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని వారి వినతి పత్రంలో తెలియజేశారని డిండి మండలం మాల మహానాడు నాయకులు అనిల్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు మాల మహానాడు డిండి మండల అధ్యక్షులు నారిమల మల్లేష్ పెరుమాళ్ళ అనిల్ కుమార్ గోరటి అంజయ్య శ్రీశైలం మురళి అంజి తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page