TRINETHRAM NEWS

Additional Collector J. Aruna has finalized the tenders for the supply of food items in minority teachers’ educational institutions

పెద్దపల్లి, జూన్ -27: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మైనారిటీ గురుకుల విద్యాసంస్థల్లో ఆహార పదార్థాల సరఫరా టెండర్లు ఖరారు చేశామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ అన్నారు.

గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో మైనారిటీ గురుకుల విద్యా సంస్థలలో ఆహార పదార్థాల సరఫరాకు దాఖలైన టెండర్లను ఓపెన్ చేశారు.

పెద్దపెల్లి జిల్లాకు సంబంధించి మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాలలో పండ్లు, కూరగాయలు, కోడి గుడ్డు/చికెన్ , కిరాణా సరుకులు, పాల సరఫరా కోసం గడువు లోగా వచ్చిన టెండర్లను అదనపు కలెక్టర్ టెండర్ దారుల సమక్షంలో ఓపెన్ చేసి ఖరారు చేశారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి మొహమ్మద్ మేరాజ్ మహ్మూద్, ఆర్.ఎల్.సి., ఉమ్మడి కరీంనగర్ జిల్లా కే. సురేష్, పాఠశాల, కళాశాలలకి సంబంధించిన ప్రిన్సిపాల్స్, సిబ్బంది, టెండర్ దారులు పాల్గొనడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Additional Collector J. Aruna has finalized the tenders for the supply of food items in minority teachers' educational institutions