ప్రవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

TRINETHRAM NEWS

Trinethram News : ఖమ్మం జిల్లా: మార్చి09
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఘోర ప్రమా దం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజా మున మండలంలోని లోక్యతండా జాతీయ రహదారిపై అదుపుతప్పి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది.

దీంతో బస్సులో ప్రయాణి స్తున్న 15 మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి క్షతగా త్రులను ఆసుపత్రికి తరలిం చారు.

హైదరాబాద్ నుంచి రాజ మండ్రికి వెళ్తుండగా ప్రమా దం చోటుచేసుకుంది. ప్రమా ద సమయంలో బస్సులో మొత్తం 30 మంది ఉన్నట్లు సమాచారం.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

You cannot copy content of this page

Scroll to Top