రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం

TRINETHRAM NEWS

స్వాగతం పలికిన ప్రభుత్వ విప్, కలెక్టర్

వేములవాడ, మార్చి 7, 2023:

మహా శివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం రాష్ట్ర ప్రభుత్వo తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి, ప్రభుత్వ విప్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, వారికి ఆలయ అర్చకులు ఆశీర్వదించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

You cannot copy content of this page

Scroll to Top