కామారెడ్డి ఎమ్మెల్యే సంచలన నిర్ణయం

TRINETHRAM NEWS

Trinethram News : కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మరో సంచలనానికి తెర తీశారు.

ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసుకునేందుకు కంప్లైంట్ బాక్సులను ఏర్పాటు చేశారు.

నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఫిర్యాదు పెట్టెలను పంపించారు.

పది రోజులకు ఒకసారి తానే స్వయంగా వచ్చి వాటిని తీసుకెళ్లాలని నిర్ణయించారు.

సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు తనకోసం వేచి చూడకుండా సులువుగా పరిష్కారం లభించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు

You cannot copy content of this page

Scroll to Top